![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో.. ఇంట్లో వినాయకుడి పూజ చేయించి శకుంతలకి రుద్రపై ఉన్న కోపాన్ని పోగొట్టాలనుకుంటుంది గంగ. అదంతా ఈజీ కాదని ఇషిక, వీరు అంటారు. మనం ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేదని గంగ అంటుంది. తను వెళ్ళిపోయాక ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ గంగ చాలా ఎక్స్ ట్రా చేస్తుంది.. రుద్ర, శకుంతల అత్తయ్యని కలపాలని ట్రై చేస్తుంది.. అలా జరగకుండా చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు.
మరొకవైపు రుద్ర సూపర్ మార్కెట్ లో వినాయక చవితికి ఆఫర్స్ పెట్టండి అని వాటికి సంబంధించిన వివరాలు చెప్తుంటాడు. అదంతా వీరు మనిషి విని వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. ఈ రుద్ర గాడు ఏం ఇన్వాల్వ్ అవట్లేదంటూనే ఇలా డెవలప్ చేస్తున్నాడేంటని వీరు అనుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారుని తీసుకొని గంగ గుడికి వస్తుంది. నువ్వు ఇంట్లో వినాయకుడికి పూజ చెయ్యడం గొడవకి దారి తీస్తుందనిపిస్తుంది.. భాను వినాయకుడి పూజ చేసేవాడు.. ఎవరు చేసిన శకుంతల ఆక్సెప్ట్ చెయ్యదని పెద్దసారు అంటాడు.
మీకు నాపై నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలని గంగ అడుగుతుంది. ఉన్నట్టుండి ఇక్కడ రుద్ర కనిపించాలని పెద్దసారు అంటాడు. అప్పుడే గంగకి వాళ్ళ అమ్మ కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి ఉండదు. ఆ తర్వాత రుద్ర గుడిలో కనిపిస్తాడు. రుద్ర గుడిలో కన్పించాడు కాబట్టి నువ్వు పూజ చెయ్యడానికి ఒప్పుకుంటున్నానని గంగతో పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీతో పెద్దసారు మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |